దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్, కర్నాటకలో భూ ప్రకంపనలు సంభవించాయి. కర్నాటక రాష్ట్రంలోని హంపిలో రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో భూకంపం ఈ రోజు ఉదయం 06:55 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
అలాగే.. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో ఉదయం 6:55 గంటలకు జంషెడ్పూర్లో భూకంపం సంభవించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు.