డాక్టర్ సుధాకర్ వ్యవహారం రోజు రోజుకి కీలక మలుపులు తిరుగుతుంది. సుధాకర్ ని మానసిక రోగుల  ఆస్పత్రిలో ఉంచడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా సుధాకర్ తల్లి హైకోర్ట్ లో మరో  పిటీషన్ దాఖలు చేసారు. 

 

హెబియస్ కార్పస్ పిటీషన్ ని ఆమె దాఖలు చేస్తూ తమ కుమారుడ్ని అక్రమంగా నిర్భందించారు అని ఆరోపించారు పిటీషన్ లో. ఇంత వరకు జ్యూడిషియల్ కష్టడి లేదా పోలీస్ కష్టడి కి అనుమతి లేదు అని ఆమె సదరు పిటీషన్ లో పేర్కొన్నారు. ఏపీ పోలీస్ సిబిఐ మాత్రమే కేసులు పెట్టాయని ఆమె తన పిటీషన్ లో ప్రస్తావించారు. పోలీసులు అక్రమంగా నిర్భంధించి మానసిక ఆప్సత్రిలో పెట్టారని లక్ష్మీ భాయ్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: