దేశంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలు, అమ్మాయిలపై లైంగికదాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మాత్రం మార్పురావడం లేదు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి పిన్ని ఇంటికి వెళ్లిన యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.