ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏఆర్ కానిస్టేబుల్ నరసింహవర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకుతాను తుపాకీతో కాల్చుకొని నరసింహవర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లడంతో నరసింహవర్మ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నరసింహవర్మ.. కాకినాడ ట్రెజరీ ఆఫీసులో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.