హైదరాబాద్ లో ట్రాఫిక్ చలానాల విషయంలో అధికారులు ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారు అనేది ఇటీవల సిఎం కేసీఆర్ కి వేసిన చలానా ద్వారా స్పష్టంగా చెప్పవచ్చు. నాలుగు చోట్ల ఆయన వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది అని పోలీసులు జరిమానా విధించారు. దీనితో ముఖ్యమంత్రి కార్యాలయం కచ్చితంగా కట్టాల్సి వచ్చింది. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి గానూ కొందరు నెంబర్ ప్లేట్ మీద పెడ రాయడం అలాగే మట్టి పూయడం నెంబర్ ప్లేట్ ని వంచడం చేస్తున్నారు. ఇక అలా ఎవరు అయినా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గురువారం నాంపల్లి ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఓ యువకుడిని రిమాండ్‌కు కూడా పంపించారు. కావాలని ఆ వ్యక్తి బూమార్ అంటించాడు అని తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: