గత మూడు రోజులుగా సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులు విచారణ వేగవంతం చేసారు. హైదరాబాద్లో తమకు ఉన్న పాత కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేయడానికే కొత్త వ్యక్తులను డ్రగ్స్ మాఫియా ఎంపిక చేసుకుందని అధికారులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులకు దొరికిన ఇద్దరినీ విచారించగా మొత్తం 22 మందితో సంబంధాలు ఉన్నాయి అని విచారణలో వెల్లడించారు.
ఈ కేసులో ప్రాథమిక చార్జిషీట్లో 22 మందిని నిందితులుగా పేర్కొన్నారు అధికారులు. నిందితులను పట్టుకునేందుకు గానూ ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఆ నిందితులపై సెక్షన్ 8సీ, ఆర్/డబ్ల్యూ 216, 17ఏ, 27 ఏ&బీ ఎండీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసామని పోలీసులు వెల్లడించారు.