వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై, లోకేశ్ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే అని అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును చంద్రబాబు సర్వ నాశనం చేశాడని చెప్పారు. 
 
ట్రస్టుకు ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే చంద్రబాబు గురించి అర్థమైంది దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని అంటూ విమర్శలు చేశారు. రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు దేశ విద్యావ్యవస్థకే తలమానికం అవుతాయని సీఎం అన్నారు. నాడు-నేడుతో కార్పోరేట్‌ స్కూళ్లను అధిగమిస్తాయని... అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద పథకాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని అన్నారు. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: