కేరళలో ఏనుగు మృతి ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనాస పండులో దీపావళి బాంబులు పెట్టి... అది తెలియక తిన్న ఏనుగు ఒక్క సారిగా దీపావళి బాంబులు పేలడంతో తీవ్ర గాయాలపాలైన తట్టుకోలేక సరస్సులోకి దిగి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఏనుగు మృతి కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు.
తాజాగా పాలక్కడ్ జిల్లాలో ఏనుగు మృతి కేసులో ఒకరిని అరెస్టు చేశారు.అనాస పండు ఇచ్చి గర్భంతో ఉన్న ఏనుగును హత్య చేసిన కేసులో అనుమానితుడి అరెస్టు చేశామని అటవీ శాఖ మంత్రి కే రాజు వెల్లడించారు.