రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. మాస్క్ ధరించలేదని యువకుడిని పోలీసులు చితకబాదారు. మాస్క్ ధరించలేదని పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా పోలీసులకు, యువకుడికి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు యువకుడి మెడపై మోకాలు పెట్టి కదలకుండా పట్టుకుని దారుణంగా కొట్టారు. 
 
కాళ్లతో తంతూ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వాళ్లు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. యువకుడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది. పోలీసులు యువకుడిపై దాడి చేయడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: