ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి . తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల్లో ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3425 కరుణ కేసులు నమోదయ్యాయి. ఇందులో చికిత్స తీసుకొని 2294 మంది డిశ్చార్జి కాగా.... ప్రస్తుతం 1060 మంది పేషెంట్లు కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ మొత్తంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. మొత్తం 9831 శాంపిల్స్ను పరీక్షించగా 50 మంది ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డట్లు ప్రభుత్వం తెలియజేసింది. 21 మంది కోలుకోగా... ఇద్దరు మరణించారు.
#COVIDUpdates: as on 05/06/2020
— ArogyaAndhra (@ArogyaAndhra) June 5, 2020
Total positive cases: 3427
Discharged: 2294
Deceased: 73
Active cases: 1060#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/SRDiI2maQk