కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాల గురించి మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడుపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి నిన్న సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలపై అఖిలప్రియ స్పందించారు. పోలీసులకు ఏవీ సుబ్బారెడ్డి డైరెక్షన్ ఇస్తున్నారంటూ ఆమె విమర్శలు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణల వెనుక ఆళ్లగడ్డ వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
ఏవీ సుబ్బారెడ్డికి పదవులు ఇస్తే తాను అడ్డుకోలేదని ఆమె అన్నారు. గంగుల కుటుంబంతో కొట్లాడి ఆళ్లగడ్డలో రాజకీయాలు ఎలా చేస్తారో చూడాలని ఉందని ఆమె అన్నారు. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో రాజకీయాలు చేస్తే స్వాగతిస్తానని అన్నారు. నన్ను అరెస్ట్ చేయాలని వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డి ఆస్తులు ఏవీ సుబ్బారెడ్డి పేరుతో ఉంటే ఆ ఆస్తులు ఎవరివని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: