వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్ల పట్టాలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 6.85 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారని అన్నారు. రాబోయే ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు కట్టాలనే లక్ష్యంతో వైసీపీ పని చేస్తోందని చెప్పారు. చంద్రబాబు ఇళ్ల గురించి చెబుతున్న అంకెలు, కారణాలు కూడా తప్పేనని బుగ్గన అన్నారు. 
 
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని అన్నారు. అర్హత ప్రకారం ఇళ్ల పట్టాలు అందజేస్తుంటే అవినీతి ఎక్కడ జరుగుతుందని బుగ్గన ప్రశ్నించారు. చంద్రబాబు 6.85 లక్షల ఇళ్లు నిర్మించి తొమ్మిది లక్షలు అని చెబుతారని... 16 లక్షల ఇళ్లకు అనుమతి ఇస్తే 20 లక్షలు అని చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు చెబుతున్న విషయాలు కూడా తప్పేనని బుగ్గన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: