వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై విమర్శలు చేశారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో డాక్టర్లు బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదని వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని.... ప్రభుత్వానికి తాను బాలకృష్ణ మానసిక పరిస్థితి గురించి లేఖ రాస్తానని చెప్పారు. 
 
బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడని..... హిందూపురం ప్రజలు ఆయన వ్యవహార శైలి వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణపై అందరికీ అభిమానం ఉందని కానీ బాలకృష్ణ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును భుజాన మోస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చచ్చిన పాము వంటివాడని... చంద్రబాబు జూమ్ బాబుగా మారిపోయాడని వ్యాఖ్యలు చేశారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: