విజయవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈరోజు సీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో మొత్తం 13 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. యనమలకుదురు దగ్గర ఒక స్థలం విషయంలో వివాదం మొదలైందని చెప్పారు. తోట సందీప్, పండు ఒకప్పుడు స్నేహితులని....ఆసుపత్రిలో సందీప్ చనిపోయాడని చెప్పారు. నిందితుడు పండుపై కూడా కేసు నమోదైందని చెప్పారు. 
 
శ్రీధర్ రెడ్డి, ప్రధీప్ రెడ్డి మధ్య అపార్టుమెంట్ వివాదం తలెత్తిందని.... ప్రదీప్ రెడ్డి పరిష్కారం కోసం నాగబాబును ఆశ్రయించారని... సమస్య పరిష్కారం కోసం నాగబాబు సందీప్, పండును పిలిపించారని చెప్పారు. సందీప్ పండును ఎందుకొచ్చావని ప్రశ్నించాడని... ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో మాట్లాడుకుందాం అని పిలిచి కళ్లల్లో కారం కొట్టి ఘర్షణకు దిగారని చెప్పారు రాజకీయ నేతల ప్రమేయం ఈ గ్యాంగ్ వార్ లో ఉందని అన్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: