తెలంగాణ వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు ముందుకు తీసుకు వచ్చారు. ఇందులో ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ పథకం ఎంతోమంది పేద ప్రజలకు లబ్ది చేకూరుతుంది. జీవితంలో ఇల్లు కట్టుకుంటామా అన్నుకున్న వారు డబుల్ బెడ్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్దిదారులకు నేడు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేశారు. గత ఏడాది అధికార పార్టీ టీఆర్ఎస్ పై ఎంతో నమ్మకాన్ని పెట్టి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని.. వారికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీ ప్రభుత్వం నెరవేరుస్తుందని.. అన్నారు పోచారం.
తన సొంత నియోజకవర్గం బాన్సువాడలోని కోటగిరి మండలం రాంనగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలిసి ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు అందజేసిన స్పీకర్, మంత్రి ఈ సందర్భంగా స్థానికంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు.
గౌరవ శాసనసభాపతి శ్రీ @PSRTRS గారితో కలిసి బాన్స్ వాడ నియోజకవర్గం కోటగిరి మండలం రాంనగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి.@VPRTRS pic.twitter.com/LcZvBCDVg9
— trs party (@trspartyonline) June 5, 2020