గుజరాత్లో త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూన్నాయి . ఇక రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం గుజరాత్ రాజకీయాలలో సంచలనం గా మారిపోయింది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 


 ఇక తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినా అక్షయ్ పటేల్, జిత్తు  చౌదరి లు గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి తమ రాజీనామాలను అందజేశారు. కాగా అటు  వెంటనే వారి రాజీనామాలను ఆమోదిస్తూన్నట్లుగా స్పీకర్ రాజేంద్ర త్రివేది కూడా వీడియో సమావేశంలో తెలిపారు. కాగా  గుజరాత్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: