నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందరభంగా పలువురు ప్రకృతి ప్రేమికులు తమ ప్రకృతి ప్రేమను వివిధరకాలుగా వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ కూడగట్టుకున్న నిధి అగర్వాల్ తన క్వారంటైన్ సమయాన్ని సోషల్ మీడియా ద్వారా గడుపుతోంది. తన తాజా అప్డేట్ లను సోషల్ మీడియా ద్వారా చేరవేస్తూ కాస్త సమయం దొరికితే యాక్టింగ్ లో మెళుకువలను నేర్చుకుంటూ ఉంది.
అంతే కాకుండా సామజిక స్పృహను కలిగి లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికీ సహాయాన్ని అందిస్తూ ఉంది. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కావడంతో తన ఇంటి చుట్టుపక్కలే ఉన్న వరి చేలో ప్రకృతి పులకరించి పోయేలా ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చి ఆ ఫోటో లను సోష మీడియాలో పోస్ట్ పెట్టింది. అవి చూడడానికి చాల ప్రకృతి రమణీయతను కలిగి ఆహ్లాదకరంగా ఉన్నాయ్.
#NidhhiAgerwal makes an appreciation post for Mother Nature on #WorldEnvironmentDay. pic.twitter.com/1LMXJBbm3I
— Filmfare (@filmfare) June 5, 2020