తమిళ నాటఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ  ఆసక్తి  రేపుతున్న చిత్రం తలైవి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కధాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఆమె ఎలా ఓ పరిపూర్ణ మహిళగా ఎదిగానే కదంశంతో తెరకెక్కించారు. అయితే ఎన్నో వివాదాల నడుమ ఆమె జీవితం కొనసాగింది. ఆమె జీవితం లో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి. ఆఖరికి ఆమె మరణ వార్తకూడా వివాదంగా మారింది.

 

ఈ నేపధ్యం లో ఆమె జీవిత కథను తలైవి చిత్రద్వారా తెరకెక్కిస్తున్న తరుణం లో తమిళనాట ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో సెన్సేషన్ హీరోయిన్ కంగనా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాకు ఇంకా హైప్ క్రియేట్ అయ్యింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం కంగన ఏంతో కష్టపడింది. అయితే ఈ చిత్రాన్ని ఓటిటి ద్వారా రిలీజ్ చేయడానికి ఈ చిత్రనిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్ మరియు అమెజాన్ ప్రైమ్ లకు  సంయుక్తంగా ఈ సినిమాను 55 కోట్లకు విక్రయించారు. ఈ 55 కోట్లు ఓటిటి చరిత్రలో భారీ మొత్తం అని అంటున్నారు విశ్లేషకులు  

మరింత సమాచారం తెలుసుకోండి: