ఈ నెల 9 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని సినీ ప్రముఖులు కలవనున్నారు. చిరంజీవి నేతృత్వంలో తాడేపల్లి సిఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ భేటీ జరగనుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణ కు సినీ పెద్దలు ఆహ్వానం ఇచ్చారు. అయితే అనూహ్యంగా బాలకృష్ణ నేను రాను అని చెప్పినట్టు తెలుస్తుంది. 

 

తన పుట్టిన రోజు ఉండటం వలన తాను రాలేను అని బాలయ్య చెప్పినట్టు తెలుస్తుంది. కాగా ఇటీవల తెలంగాణా సిఎం కేసీఆర్ ని కలిసిన సమయంలో తనకు ఆహ్వానం ఇవ్వలేదు అని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ తో భేటీ కి ఆహ్వానం ఇవ్వగా తను రాలేను అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: