ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం థమ్స్ అప్ తాగి ఒక మహిళ అపస్మారక స్థితికి చేరుకుంది. వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు వద్ద గల షేక్ మహ్మద్ నజీమా అనే మహిళ దాహంగా ఉండటంతో కూల్ డ్రింక్ తాగింది. తాగిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలలోకి వెళితే నజీమా అనే మహిళకు వెదుళ్లపల్లి ర్యాంపు వద్ద చిన్నపాటి టిఫిన్ హోటల్ ఉంది.
టిఫిన్ వండుతూ అలసిపోయిన నజీమా పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపు నుంచి థమ్స్ అప్ బాటిల్ తెప్పించుకుంది. కూల్ డ్రింక్ తాగే సమయంలో బాటిల్ నుంచి దుర్వాసన వచ్చింది. నజీమా బాటిల్ ను పరిశీలించగా కూల్ డ్రింక్ లో పురుగులు కనిపించాయి. డ్రింక్ తాగిన నజీమాకు వాంతులు కావడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమె ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదని చెప్పారు.