ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పొందూరు రెవిన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. ఆక్రమణలు ఉంటే పోలీసుల సహాయం తీసుకుని ఖాళీ చేయించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను వెనక్కు తీసుకోకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. కొన్ని భూముల్లో వైసీపీ నేతలు కూడా ఉన్నారని అధికారులు స్పీకర్ కు చెప్పారు. 
 
స్పీకర్ ఎవరినీ ఉపేక్షించేది లేదని... వైసీపీ నేతలకు తాను చెబుతానని అన్నారు. ఎవరినీ ఎంటర్ టైన్ చేసే పరిస్థితి లేనే లేదని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా రెవిన్యూ సిబ్బంది వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో నిర్లక్ష్యం తగదని అన్నారు. వెంటనే భూముల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: