విజయవాడలో గ్యాంగ్ వార్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ గ్యాంగ్ వార్ కు సంబంధించిన కేసు విచారణలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్ వల్లనే ఈ గ్యాంగ్ వార్ జరిగింది అని ముందుగా భావించగా.. ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారం లో పండు కు ఎలాంటి సంబంధం లేదు అంటూ అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పండుకు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి 15 ఇవ్వాల్సి ఉండడంతో అవి తీసుకునేందుకు పండు వెళ్లాడని... ఆ సమయంలోనే సందీప్ అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడని అంటూ ప్రస్తుతం పండు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

 


 పొరపాటున పండు వెళ్లి సెటిల్మెంట్ దగ్గర కూర్చోవడంతో సందీప్ అనే వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తన అనుచరులతో ఏకంగా ఇంటిమీద దాడి చేయడానికి కూడా పంపించాడు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత పండు ని ఒకసారి మాట్లాడాలి అని పిలిచి... పండును హత్య చేయాలని భావించగా ఆ ఘర్షణలో సందీప్ కి కత్తి పోట్లు కావడంతో సందీప్ మరణించాడు అంటూ చెప్పుకొచ్చారు తల్లిదండ్రులు. ఇలా గ్యాంగ్ వార్ హత్య కేసులో కొత్త కోణం బయటపడడంతో పోలీసులు మరో కోణంలో కూడా విచారణ ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: