అంతర్జాతీయ ఉగ్రవాది... దశాబ్దాలు గా భారత నిఘా వర్గాలకు కూడా దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం కరోనాతో మరణించడా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అతనికి అతని భార్యకు కరోనా సోకిందని నిన్న సాయంత్రం అతన్ని కరాచి లోని ఒక ఆస్పత్రిలో జాయిన్ చేసారు అనే కథనాలు వచ్చాయి. 

 

దీనిపై అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. దావూద్ మరణించాడు అనే దానిపై అతని కుటుంబ సభ్యులు వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. దావూద్ మరణం పై ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీ నుంచి గాని ఆ దేశ ప్రభుత్వం నుంచి గాని ఏ స్పందనా రాలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అంతా ఆ దేశ గూడచారి సంస్థ ఐఎస్ఐ కుట్ర అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: