ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆయనను గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలు మరువలేనివి అంటూ చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. భారతదేశంలోని 13 భాషలలో అతి తక్కువ కాలంలో శతాధిక చిత్రాలను నిర్మించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన నిర్మాత స్వర్గీయ డా.రామానాయుడుగారు అని ట్వీట్ చేసారు. 

 

మాజీ పార్లమెంటు సభ్యులుగా బాపట్ల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తాను సినీరంగంలో సంపాదించిన డబ్బును తిరిగి ఆ రంగ అభివృద్ధికే ఖర్చుచేసి ఎంతో మందికి ఉపాధినిచ్చారు రామానాయుడుగారని పేర్కొన్నారు. ఈరోజు పద్మ భూషణ్ రామానాయుడుగారి జయంతి సందర్భంగా సినీరాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: