విజయవాడ గ్యాంగ్ వార్ లో పోలీసులు విచారణను వేగవంతం చేసారు. ఈ ఘటనలో ఇప్పుడు కీలకంగా భావిస్తున్న కోడూరి ణిమణికంఠ అలియాస్ పండుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటుగా అతని గ్యాంగ్ లోని 13 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్ గ్యాంగ్ లోని 15 మందిని కూడా పోలీసుల అరెస్ట్ చేసారు.

 

ఈ 28 మందిపై కూడా కేసులను నమోదు చేసారు. అదే విధంగా వీరు అందరిపై రౌడీ షీట్ ఓపెన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.  ఇప్పటికే డీజీపీ నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్టు సమాచారం. ఇక మరికొంత మందిని కూడా త్వరలో అదుపులోకి తీసుకునే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: