కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గుండాలకు రావాల్సిన నీటిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అక్రమంగా పాలకుర్తికి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎర్రబెల్లి మంత్రి కావడం మన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంతోషం కొందరిలోనే ఉందన్న ఆయన..
కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా రైతులను ఆదుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేసారు. అదే విధంగా ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు ఇస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. గందమళ్ల రిజర్వాయర్ రద్దైనట్లేనని అధికారులు చెప్పారన్న ఆయన... బస్వాపూర్ నుంచి గుండాల మండలానికి నీళ్లు రావని పేర్కొన్నారు. ఏడాది లోగా బస్వాపూర్ నుంచి ఆలేరుకు నీళ్లు తీసుకొస్తే కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేస్తామన్నారు ఆయన.