ఆంధ్రప్రదేశ్ లో అధికారుల తీరుపై అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు రెవెన్యు సహా పలు శాఖల అధికారులపై తమదైన రీతిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

ఇసుక కొరత సమస్య పరిష్కారానికి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్న ఆయన... గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ఇసుక వ్యవహారంలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఇకపై కూడా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సమస్యను పరిష్కరిస్తారని భావిస్తున్నానని రఘురామ ఆశాభావం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: