ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది వైసీపీ పాలనపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని నరేంద్ర ఆరోపించారు. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

 

నవరత్నాల పేరుతో నయా దోపిడీకి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రూ.3 వేల పింఛను ఇస్తామని సీఎం జగన్ మాట తప్పారని ఆయన ఆరోపించారు. లక్షల పెన్షన్లు తొలగించి పేదల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రచారాలకు దూరమంటూనే ప్రకటనలకు కోట్లు ఖర్చు చేస్తున్నారన్న ఆయన... పేదలకు ఇళ్ల పేరుతో విలువైన స్థలాలను కాజేశారని ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: