దివాకర్ ట్రావెల్స్‌ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత జేసి ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసారు అధికారులు. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసారు. ఆయనతో పాటుగా మరో ఐదుగురిపై తాడిపత్రి పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 

 

ఆయన ఇంటి ముందు లారీ ఓనర్లు ఆందోళనకు దిగారు. దీనితో ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకున్నారని, ఈ కారణంగా తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారని ఆయనపై ఆరోపణలు చేసారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బీఎస్-3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని వారు ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: