ఇటీవల కేరళలోని పాలక్కడ్‌లో గర్భిణి ఏనుగుమి చంపడంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో చనిపోయిన గర్భిణి ఏనుగు విషయంలో కొత్త కోణం విచారణలో బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే కేరళలో చనిపోయిన ఏనుగు పైనాపిల్ తినలేదు అని... ఫైర్ క్రాకర్స్‌తో నిండిన కొబ్బరిబోండాంను తినిపించారు అని తేల్చారు.

 

ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడిని పోలీసులు ఘటన స్థలానికి తీసుకుని వెళ్ళగా అసలు విషయం బయటకువచ్చింది. అండవి పందులు, ఇతర జంతువులు పంటను పాడు చేయకుండా ఉండటానికి గానూ ఇలాంటి బాంబులను వాడతారు అని ఇప్పుడు దానిని ఏనుగుకి వాడారు అని పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులను కూడా ఈ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: