పాలనలో తనదైన ముద్ర వేయడం అంటే... వైసీపీ పాలకుల అర్ధాలే వేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేసారు. తెలుగుదేశం పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం, టిడిపి కట్టిన భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడం, స్కీములు రద్దు చేయడం..మసిబూసి మారేడుకాయ చేయడమని ఆయన ఎద్దేవా చేసారు. 

 

ఏడాది వైసీపీ పాలన నిర్వాకాలు ఇవే ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం..మాటల్లో తేనె, చేతల్లో కత్తులు- కోతలు.. మోసగాళ్ల(420) పాలన కదా మరి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడో చనిపోయిన వైఎస్ వల్లే ఇప్పుడు కియా వచ్చిందంటారని... 8ఏళ్ల క్రితం "సున్నా వడ్డీ" పథకం మేమే తెచ్చాం అంటారని... రూ 1,000 కరోనా సాయం కేంద్రం చేస్తే మేమే ఇచ్చాం అంటారని.. గాంధీ విగ్రహానికి, జాతీయ జెండాకు వైసీపీ రంగులేయడం వీళ్ల స్టిక్కర్ల పిచ్చికి పరాకాష్ట అని... పరుల కష్టానికి వైసీపీ కబ్జా స్టిక్కర్ అంటే ఇదే అంటూ ఆయన ట్వీట్ లు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: