ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావి ప్రాంతంలో కరోనా ఏ మాత్రం ఆగడం లేదు. అక్కడ నిదానంగా కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. అక్కడ చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. ఇక అక్కడ మరో పది కేసులు బయటపడినట్టు అధికారులు వెల్లడించారు. 

 

దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,899కి చేరిందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక అక్కడ మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. ధారావి ప్రాంతంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 71 మంది ప్రాణాలు కోల్పోయారు అని పేర్కొన్నారు. ఇక ముంబై లో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: