ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పుడు విద్యుత్ బిల్లులకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. విద్యుత్ బిల్లులను ఎక్కువగా వసూలు చేస్తున్నారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక టీవీ ఉన్న వారికి కూడా వేలల్లో కరెంట్ బిల్లు వస్తుంది ఇప్పుడు. దీనిపై ప్రభుత్వాలు చెప్పే సమాధానం ఏ విధంగా ఉన్నా సరే అంతిమంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి.
ఇక తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ బిల్లుల ఆసక్తికరమైన కేసు.. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఒక ఎసి, ఒక టివి, 2 ఫ్యాన్స్ & 6 లైట్లతో ఉండే కరెంట్ బిల్లు ఇది అంటూ బిల్లుని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అంతకు ముందు 1500 బిల్లు దాటి వచ్చిన సందర్భం లేదు అని ఇప్పుడు ఏకంగా ఈ నెలలో 12907 వచ్చింది అని పేర్కొన్నారు.
Curious case of electricity bills in #Telangana! Here is the bill of a family from malkajgiri, #Hyderabad with one AC, one tv, 2 fans & 6 lights. Their bill never crossed 1500Rs earlier, this month it is 12907 Rs. Am starting a thread, msg me if it is the case with your bill too pic.twitter.com/UPDK3n8qNb
— revathi (@revathitweets) June 6, 2020