దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. గత రెండు రోజుల నుంచి ప్రతీ రోజు కూడా దాదాపు పది వేల కేసులకు పైగా నమోదు అవుతున్నాయి. ఇక నిన్న ఒక్క రోజే ఏకంగా దేశంలో పది వేల మార్క్ దాటి కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కూడా మరణాలు నమోదు అయ్యాయి. 10,438 కేసులు నమోదు కాగా దాదాపు 300 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

 

మొత్తం కేసుల సంఖ్య ఒకసారి చూస్తే 246,622 గా ఉంది. ఇక మరణాలు కూడా 7 వేలకు దగ్గరలో ఉన్నాయి. 6,946 మంది చనిపోగా 118,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: