హైదరాబాద్ లో ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం తల నొప్పిగా మారింది. నిన్న పంజా గుట్టలో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 గ్రాముల డ్రగ్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఎవరికి విక్రయిస్తున్నారు అనే దాని మీద అధికారులు నిఘా పెంచారు. ఇక వీరిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. పంజాబ్ సహా బెంగళూరు నుంచి డ్రగ్స్ ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు అని అధికారులు చెప్తున్నారు.

 

అమిత్, పరం అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 22 మంది సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులను పోలీసులు గుర్తించారు. వీరు అందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇక అధికారులు డ్రగ్స్ పై నిఘా పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: