విశాఖ జిల్లా ఎమ్మార్వో ఆఫీస్ లో దారుణం జరిగింది. నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో పని చేస్తున్న సత్తిబాబు అనే ప్యూన్ మంచి నీళ్ళు అనుకుని శానిటైజర్ తాగాడు. అది గమనించిన సిబ్బంది అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 

 

కరోనా కారణంగా శానిటైజర్ వాడకం క్రమంగా పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని లేకపోతే ఇబ్బందులు వస్తాయని ఎన్ని సార్లు చెప్తున్నా కొందరు మాత్రం వాటి విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సత్తిబాబుకి భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నట్టు సమాచారం. అతని కుటుంబానికి ప్రభుత్వం ఏదోక ఆర్ధిక సాయం చెయ్యాలి అని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: