దేశంలో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా కేసులు పెరగడం మొదలయ్యాయి.  మార్చి నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్, విద్యా వ్యవస్థ, దేవాలయాలు, థియేటర్లు అన్నీ మూసివేశారు.  ఈ మద్య లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీ, బార్లు, క్లబ్బులు తప్ప మిగతావి ఓపెన్ చేసుకోవడానికి ఓకే చెప్పారు.  అయితే దేశవ్యాప్తంగా రేపటి నుంచి మాల్స్‌, గుళ్లు ఓపెన్‌ అయినప్పటికీ హర్యానాలోని గుర్గావ్‌, ఫరిదాబాద్‌ జిల్లాల్లో మాత్రం పర్మిషన్‌ లేదని రాష్ట్ర హోం మినిస్టర్‌‌ అనిల్‌ విజ్‌ ఆదివారం చెప్పారు.

 

 

ఆ రెండు జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే హర్యానాలోని మిగతా ప్రాంతాల్లో ఓపెన్‌ చేసేందుకు పర్మిషన్‌ ఇచ్చారు.  అన్‌లాక్‌ 1 కింద ఈ నెల 8 నుంచి గుళ్లు, షాపింగ్‌మాల్స్‌, రెస్టారెంట్లకు అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం మనోహర్‌‌లాల్‌ ఖట్టర్‌‌తో భేటీ అయి దీనిపై డెసిషన్‌ తీసుకున్నామన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: