ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే థర్మల్ స్క్రీనింగ్ అనేది తప్పనిసరిగా మారింది. కరోనా లక్షణాల్లో జ్వరం కూడా ఒకటి కావడంతో ఇప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల కూడా థర్మల్ స్క్రీనింగ్ అనేది తప్పనిసరిగా మారింది అని చెప్పవచ్చు. తాజాగా ఒక ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. 

 

ప్రముఖ నటుడు, దర్శకుడు రవి బాబు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఒకరు థర్మల్ స్క్రీనింగ్ చేసారు. తన వెంట తెచ్చుకున్న థర్మల్ స్క్రీనింగ్ పరికరంతో రవి బాబు భద్రతా సిబ్బందికి కూడా స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ వీడియో ని మంచు విష్ణు షేర్ చేస్తూ ఇలాంటి రవి బాబు మాత్రమే చేస్తారు అంటూ కామెంట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: