తెలంగాణలో కాంగ్రెస్ నేతలు మంత్రి కేటిఆర్ పై చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఆయనను రాజీనామా చేయమనడంపై ఇప్పుడు తెరాస నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి మంత్రి కేటిఅర్ కి అండగా నిలబడ్డారు. రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేసారు. కేటిఆర్ నిజంగా అవినీతి చేసారని నిరూపిస్తే తెరాస కి వ్యతిరేకంగా పని చేస్తా అన్నారు ఆయన. 

 

ఆరోపణలు చేసి మంత్రిని రాజీనామా చేయమనడం ఏంటీ అని ప్రశ్నించారు. హరీష్ రావు, కేటిఆర్ నిజాయితి పరులు అని అన్నారు. 50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని పోసాని ఆరోపించారు. కేటిఆర్ కేసీఆర్ తెలంగాణకు రెండు కళ్ళు అన్నారు పోసాని.

మరింత సమాచారం తెలుసుకోండి: