తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ తెరాసా పార్టీ నాయకుడు కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ ఇప్పటికే అక్రమాస్తులను కూడబెట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అయన దుయ్యబట్టింది సంగతి తెలిసిందే. ఈవిషయమై ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు బాల్కసుమన్ మరియు సైదా రెడ్డిలు ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోశారు. అయితే కేటీఆర్ కి ఎటువంటి అక్రమాస్తులు లేవంటూ వారు  దుయ్య బట్టారు.

 

రేవంతా రెడ్డి వి నిరాధారితమైన ఆరోపణలు అని అన్నారు .అదేవిధముగా రేవంత్ రెడ్డి కి ఉన్న బినామీ ఆస్తులను వారు బయటపెట్టారు. అయితే ఇదంతా నిశితంగా పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి ...ఆదివారం అర్ధరాత్రి న ట్విట్టర్ వేదికగా బాంబ్ పేల్చాడు..అదేంటంటే .. ఇన్ ఫ్రెంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్ ..రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ..అంటూ పోస్ట్ చేస్తూ @ktrtrs  @TelanganaCMO  అంటూ ప్రత్యేక ట్యాగ్స్ కూడా పెట్టారు ..అయితే ఆ ముసళ్ళపండగ తళుకు విశేషాలు తెలుసుకోవడానికి సర్వత్రా ఆసక్తి నెలకొంది ...

మరింత సమాచారం తెలుసుకోండి: