దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి చేయడం కూడా సాధ్యం కాదు అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. కరోనా కట్టడికి ఏ విధంగా చర్యలు తీసుకున్నా సరే వేల కేసులు వందల మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి దేశంలో అని చెప్పవచ్చు. మే మొదటి వారం నుంచి కూడా భారీగా కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశాలు కనపడటం లేదు అనే చెప్పాలి.
ఇక దేశంలో కరోనా కేసులు ఇదే విధంగా నమోదు అయితే మరో నాలుగు రోజుల్లోనే మూడు లక్షలకు కరోనా కేసుల సంఖ్య చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతీ రోజు కూడా 250 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు.