ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే తగ్గినట్టే తగ్గి మళ్ళీ కేసులు నమోదు అవుతున్నాయి. ఢిల్లీ మర్కాజ్ ఘటన తో ప్రభావితం అయిన ప్రకాశం జిల్లాలో మళ్ళీ వేగంగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి అని చెప్పవచ్చు. 

 

తాజాగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 117కు చేరిందని అధికారులు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 44,942  శాంపిల్స్ ని పంపించారు. అందులో 42,402 నెగిటివ్ ఫలితాలు వచ్చాయని అధికారులు చెప్పారు. ఇంకా 2423 మంది రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.  జిల్లా వ్యాప్తంగా 534 మంది క్వారంటైన్లలో ఉన్నారని... ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకుని 66 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: