తెలంగాణా సచివాలయాన్ని కూడా కరోనా వైరస్ తాకింది. ఫైనాన్స్ విభాగంలో పని చేసే తండ్రి కొడుకులకు కరోనా వచ్చిందని తెలుస్తుంది.  దీనితో ఉద్యోగులు అందరిని కూడా అధికారులు బయటకు పంపించారు. కరోనా ఇంకా ఎంత మందికి సోకి ఉంటుందో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక అందులో పని చేసే ఉద్యోగులు 30 మందిని క్వారంటైన్ కి వెళ్ళాలి అని కోరారు అధికారులు. ఇక ఈ ఘటనపై తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆరా తీసింది. అందులో పని చేసే ఉద్యోగులు అందరికి కూడా కరోనా పరిక్షలు చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.  కాగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా నిన్న కరోనా బయటపడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: