తెలంగాణ సీఎం కేసీఆర్ పై అభ్యంతరకర పోస్టు సోషల్ మీడియాలో కలకలం రేపింది. సీఎంపై అత్యంత అభ్యంతరకరంగా రాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు టీఆర్ఎస్ నేతలు నేతలు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసీఆర్‌పై వ్యతిరేకత ఉంటే విమర్శించవచ్చు కానీ అభ్యంతరకర పోస్టులు పెట్టడం సరికాదని... రాజుపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. 
 
సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే అభ్యంతరకర పోస్టును సోషల్ మీడియాలో తొలగించారు. షేరింగ్ లింకులను కూడా ఇప్పటికే తొలగించిన పోలీసులు... పోస్ట్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద అతనిపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది. గతంలో కూడా సీఎం కేసీఆర్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: