ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో నిన్న 199 కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 125 మంది కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన 28 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. 
 
ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,843కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,381 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,387 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24 గంటల్లో కొత్త మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 75 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: