స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో జగన్ బాలకృష్ణ అభిమాని అని వార్తలు వైరల్ అయ్యాయి. అందుకు ఆధారాలుగా కొన్ని పేపర్ క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ వైరల్ అయిన ఆ వార్తల గురించి స్పందించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అభిమానేనని బాలకృష్ణ చెప్పారు. 
 
కడప టౌన్ బాలకృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంట్ జగన్ అని బాలయ్య స్పష్టం చేశారు. జగన్ కడపలో నా సినిమాలకు బ్యానర్స్ కట్టేవారని తెలుసని అన్నారు. అయినప్పటికీ జగన్ తనను ఎప్పుడూ కలవలేదని చెప్పారు. రాజకీయం వేరు... అభిమానం వేరు అని వ్యాఖ్యలు చేశారు. నాన్న ఎన్టీఆర్ కు కాంగ్రెస్ పార్టీలో కూడా అభిమానులు ఉన్నారని... తాను దైవాన్ని ఎక్కువగా నమ్ముతానని బాలకృష్ణ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: