ఒక పక్క కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నా సరే కొందరు అధికార పార్టీ నేతల తీరు ఆంధ్రప్రదేశ్ లో మారడం లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా సరే వారు చెయ్యాలి అనుకున్నది మాత్రమే చేస్తున్నారు. రాజకీయంగా సిఎం జగన్ కి కొందరి నేతల తీరు ఇలాగే తల నొప్పి తెచ్చి పెడుతున్నారు. తాజాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

 

దీనికి వందల మందిని ఆహ్వానించారు. దీనిపై తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది. “కరోనా సమయం లో కూడా జగ్రత్తలు పాటించకుండా రైల్వే కోడూరు ఎమ్మెల్యె, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు  జన్మదిన వేడుకలు. వీరు కరోనా కు మరియు చట్టాలకు అతీతులా అని ప్రశ్నించింది ఆ పార్టీ.

మరింత సమాచారం తెలుసుకోండి: