టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు గత పాలన లక్ష్యంగా ఆయన విమర్శలు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల సంపాదన కోసమే నీరు చెట్టు పథకం తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 

 

జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశంలో ఏపీ నాలుగో స్థానానికి చేరిందన్నారు మంత్రి బాలినేని. విద్యుత్ రంగంలో టీడీపీ ప్రభుత్వం చేసిన రూ.70 వేల కోట్ల అప్పులను చెల్లించామని చెప్పుకొచ్చారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఫ్యాక్టరీలు రాష్ట్రంలో 86 ఉన్నట్టు గుర్తించామని ఈ సందర్భంగా వివరించారు. కమిటీ పరిశీలించిన తరువాతే పునఃప్రారంభానికి అనుమతి ఇస్తామని ఈ సందర్భంగా  స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: