టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థ సారధి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. లోకేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమపై చేసిన ఆరోపణలకు గానూ సారధి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాధానం చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు కి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు సారధి. రైతుల గురించి ఆలోచించిన ప్రభుత్వం తమదే అన్నారు ఆయన. 

 

చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదు అన్నారు సారధి... చంద్రబాబు నాయుడు పథకాలను అమలు చెయ్యాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేసారు. దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు అంటూ సారధి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. లోకేష్ కి దమ్ము ఉంటే చర్చకు రావాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: