తెలంగాణాలో లాక్ డౌన్ అమలుకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేసులు పెరగడంపై కేసీఆర్ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అధికారుల పని తీరుపై కూడా ఆయన సమాచారం తెలుసుకున్నారు. ఇక హైదరాబాద్ పరిస్థితిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న కేసీఆర్ ఇక కంటైన్మేంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చెయ్యాలి అని భావిస్తున్నారు. 

 

దీనికి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. లాక్ డౌన్ ని కొన్ని చోట్ల సడలించకుండా  ఉండటమే మంచిది అని కేసీఆర్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు అధికారులు కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది అని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: